బుల్లితెర నటుడు మృతి

యశవంతపుర : హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సీరియల్‌ కళాకారుడు, నిర్మాత సంజీవ్‌ కులకర్ణి (49) శనివారం సాయంత్రం కన్నుమూశారు. సంజీవ్‌ బుల్లితెరపై కూడా నటించారు. ఆయన గత కొంతకాలంగా బెంగళూరు నారాయణ హృదయాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చామరాజపేట టీఆర్‌ మిల్‌ వద్దనున్న స్మశాన వాటికలో ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి.